బేగంపేట్ ఏప్రిల్ 29 : వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు పొందాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. బుధవారం వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బన్సీలాల్పేట్ డివిజన్ భోలక్పూర్కు చెందిన కోన భాస్కర్రావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2.75 లక్షల రూపాయల ఆర్థిక మంజూరు పత్రాన్ని అందజేశారు.
భాస్కర్రావు కొంత కాలంగా క్యాన్సర్తో బాధ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెరుగైన చికిత్స చేయించుకోలేక పోతున్నామని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ను కలిసి సహాయం కోరారు. ఎమ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం పత్రాన్ని భాస్కర్రావు కుమారుడు సాయి ప్రశాంత్కు అందజేశారు.