హైదరాబాద్ : మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో(Parliament elections) బీఆర్ఎస్(BRS) అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ కొత్తపేట డివిజన్లో భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అందు బాటులో ఉండే నాయకుడిని గెలిపించాలన్నారు.
గత ఎన్నికల్లో బూటకపు హమీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక హమీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ను కాదని ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు.. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, డివిజన్ నాయకులు రాహుల్గౌడ్, మహిళా వర్కింగ్ ప్రసిడెంట్ విజయ గౌడ్, మాజీ అధ్యక్షుడు రాగిరి ఉదయ్ గౌడ్, మహేష్ రెడ్డి, గుండుమల్ల పాండుగౌడ్, ప్రవీణ్ గౌడ్, మల్లెపాక యాదగిరి, రూపా సింగ్, పద్మ, సునిలారెడ్డి, నిఖిల్ గౌడ్, ఆర్. కన్నయ్య ముదిరాజ్, నగేష్, ఇటిక్యాల యాదగిరి, యాసిన్, రమావత్ దీప్లాల్, కంఠం శ్రీనివాస్, బాలా నర్సింహా, రామకృష్ణ, శ్రీనివాస్, యు. రాజు, తాళ్ల శ్రీశైలం గౌడ్, జోగు కృష్ణ, బాలాజీ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.