హైదరాబాద్ : శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటున్న తమ భూములను కాపాడాలని మహిళా రైతులు సబితా ఇంద్రారెడ్డి వద్ద బోరున విలపించారు. బాధిత రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగాఉంటుందని ఆమె వారికి భరోసానిచ్చారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు.
శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటున్న తమ భూములను కాపాడాలని సబితా ఇంద్రారెడ్డి వద్ద బోరున విలపించిన మహిళా రైతులు https://t.co/cw5LFnnYwM pic.twitter.com/pDcc2QiDZR
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2026