బడంగ్పేట, ఏప్రిల్ 11: చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగుర వేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కంకణ బద్ధులై పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్లో గురువారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చలో చేవెళ్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. ఈనెల13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు.
అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని మూడో సారి చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగుర వేద్దామన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కోరారు. ఈ సమావేశంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్, బాలమణి, రాజేందర్రెడ్డి, కో ఆప్షన్ పల్లె జంగయ్య గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అర్కల కామేశ్ రెడ్డి, భూపేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.