బడంగ్పేట్, జనవరి 11 : కాంక్రీట్ జంగల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో పార్కులో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు, వాకింగ్ ట్రాక్లాంటి వాటిని నిత్యం వందలాది మంది ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.
పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న పెద్దలు సేద తీరటానికి ఎంతో ఉపయోగపడతుందని పేర్కొన్నారు. రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో మరింతగా పార్కును విస్తరించటానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అర్బన్ పార్కులను ప్రజల కోసం తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాధి, నాయకులు యూసుఫ్ పటేల్, కౌన్సిలర్ శంషొద్దీన్ పాల్గొన్నారు.