చిక్కడపల్లి,మార్చి20 : పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్లోని శ్రీరాంనగర్ బస్తీలో ఉన్న ప్రభుత్వ అరుంధతినగర్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠాశాలలో తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని వాటర్వర్క్స్ డీజీఎం మోహన్ రాజ్ను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ,డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపాటి మోజస్,మన్నే దామోదర్రెడ్డి, బస్తీ అధ్యక్షుడు జయదేవ్, వివేక్, టెంపుల్ జనార్దన్, శివకుమార్ యాదవ్, సంతోష్,శ్రావణ్,ప్రవీణ్ ముదిరాజ్, నితిన్, టీవీ రాజు, పాఠశాల ఇన్చార్జి ఆయుషా, బస్తీ నాయకులు శివకుమార్,ప్రేమ్,ధానయ్య, సుధాకర్, సంతోష్,మహేశ్వర్,రవి, చిన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని సబర్మతినగర్ బస్తీలో సోమవారం హుస్సేన్ సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను ఎమ్మెల్యే ముఠాగోపాల్, ముఠా జయసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ నాలా రిటైనింగ్ నిర్మాణంతో వరద ముంపునకు శాశ్వత పరిష్కారమవుతుందుని తెలిపారు. కవాడిగూడ గోషాల నుంచి గోల్నాక నాలా వరకు రిటైనింగ్ వాల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తవుతాయని ఆయన వివరించారు. ఇప్పటికే అరుంధతి నగర్, ధోబీఘాట్ బస్తీ, బాపూనగర్, అశోక్నగర్ ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ,ఎస్ఎన్డీపీ డీఈ ప్రవీణ్, ఏఈ శ్యామ్ సుందర్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్కుమార్,నాయకులు ముఠా నరేశ్, ఎర్రం శ్రీనివాస్ గుప్త, జీవై గిరి, ఎంబీ కృష్ణ, పున్న సత్యనారాయణ, బత్తుల కిరణ్కుమార్, హన్మంతు, రాజ్కుమార్, ఆనంద్, చందు, జహంగీర్, విఠల్, వెంకటేశ్, స్థానిక బస్తీ నాయకులు జీవై గిరి, మహ్మద్ యాసీన్, నర్సింగ్ రావు ముదిరాజ్, ఎండీ గౌస్, రాజు, చందు పాల్గొన్నారు.
ముషీరాబాద్, మార్చి 20: ముషీరాబాద్ డివిజన్ ఫ్రెండ్స్ కాలనీ డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. బస్తీల పర్యటనల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు మెరుగైన సౌకర్యాల కల్పన కోసమే కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఫ్రెండ్స్ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇళ్లల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ గీత, జలమండలి మేనేజర్ నవీన్, టీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, గోరఖ్నాథ్, శ్రీధర్రెడ్డి, దీన్దయాల్రెడ్డి, శివ ముదిరాజ్, బాబురావు, బల్ల ప్రశాంత్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ, మార్చి 20: అరవింద్నగర్ కాలనీలో నాలా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం కవాడిగూడ డివిజన్లోని అరవింద్నగర్ నాలా నిర్మాణ పనులను బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ముఠా జయసింహ, ఏఈ ప్రవీణ్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అరవింద్నగర్ కాలనీకి ఆనుకొని ఉన్న నాలా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే సహించేంది లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, రాంచందర్, గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, రాజేశ్, ప్రభాకర్, మధు, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.