చిక్కడపల్లి, ఫిబ్రవరి 12: దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే ముఠా గోపాల అన్నారు. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్ డివిజన్కు చెందిన బత్తుల కిరణ్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారును ఆదివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువజన నాయకుడు ముఠా జయసింహ తో కలిసి ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. బడ్జెట్లో దళిత బంధు పథకానికి రూ.17, 700 కోట్లను కేటాయించడం అభినందనీయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దళిత సంక్షేమం సాధ్యం అని పేర్కొన్నారు. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్తో సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని వివరించారు. ఈ పథకం దళితుల సాధికారతకు ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్ కుమార్, మజీ కార్పొరేటర్ ముఠా పద్మ,నాయకులు ముఠా నరేశ్,శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీశ్ బాబు, మారిశెట్టి నర్సింగ్ రావు, రవి శంకర్గుప్తా, పున్న సత్యనారాయణ, పీఎస్ శ్రీనివాస్, రాజ్కుమార్, హనుమంతు, జహంగీర్, వెంకటేశ్, చందుకు సురేశ్, ఎంబీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు సీఎంఆర్ఎఫ్తో చేయూత ..
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షలాదిమంది పేదలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం భోలక్పూర్లో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎనిమిది మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి, అత్యవసర శస్త్ర చికిత్స అవసరమైన పేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్న ఘన త కేసీఆర్కే దక్కిందని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, సీఎం కేసీఆర్ ఏ పథకం తీసుకు న్నా పేదల హితం కోసమేనన్నారు. ముఠా జయసింహ, వై. శ్రీనివాసరావు, మక్బుల్, శంకర్గౌడ్, సాయి, భీమ్, ప్రవీణ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.