ముషీరాబాద్/చిక్కడపల్లి, జూలై 2: దేశంలోనే బలమైన రాజకీయ శక్తిగా, దేశానికి దిక్సూచిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం అడిక్మెట్ డివిజన్ రాంనగర్ ఈసేవా వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండా ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తరహా అభివృద్ధిని వారు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వివిధ రాష్ర్టాల్లో ప్రజల మద్దతుతో సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జయసింహ, నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి,రవియాదవ్, సురేందర్, శ్రీనివాస్, మహ్మద్ ఖదిర్, నాగులు, శ్రీధర్రెడ్డి, ప్రవీణ్, రవి, ఎం. సత్యనారాయణ, ధర్మ పాల్గొన్నారు.
వైద్యులు ప్రాణదాతలు : ఎమ్మెల్యే
వైద్యులు వైద్యం అందించి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఆదివారం గాంధీనగర్లో ప్రముఖ డాక్టర్ వెంకటరమణను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి మాట్లాడారు. అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి ప్రవిత్రమైందన్నారు. డాక్టర్ వెంకటరమణ ప్రజలకు వైద్యసేవలందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం నాయుడు ముఠా జయసింహ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, లక్ష్మణ్, గడ్డమీది శ్రీనివాస్, జీవై గిరి, సుధాకర్ పాల్గొన్నారు.
అదేవిధంగా కార్పొరేటర్ పావనీవినయ్కుమార్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ మంగళను ఘనంగా సన్మానించారు. ఆమె వెంట బీజేపీ నగర్ నాయకులు ఎ.వినయ్కుమార్, నాయకులు రత్నసాయిచంద్, నాయకులు వీఎస్టీ రాజు, శ్రీనివాస్, సత్తి రెడ్డి, అశోక్యాదవ్, యాదగిరి, సత్యం పాల్గొన్నారు.