మల్కాజిగిరి, జనవరి 12: ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి చికెన్, మటన్ షాప్స్ ఓనర్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహ చికెన్ సంస్థ నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. వినాయక్నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్థానిక వ్యాపారులకు మద్దతుగా ఉంటామన్నారు.