నేరేడ్మెట్, మార్చి 18: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. సోమవారం సీబీఎన్ కాలనీ, భూపేష్నగర్, కిందిబస్తీ, కుమ్మరి బస్తీ, మంగల్బస్తీ, కల్వర్లి లైన్, యాప్రాల్లలోని వివిధ కాలనీలలో నెలకొన్న సమస్యలను స్థానిక కార్పొరేటర్ మీనతో కలిసి పాదయాత్ర చేస్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒక్కొక్క కాలనీల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈమేరకు సీబీఎన్ కాలనీలోని వాంబే గృహాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలని, మురుగునీరు నిర్వాహణ, రోడ్డుకు అడ్డంగా ఏర్పాటుచేసిన విద్యుత్ వైర్లు సరిచేయాలని, ఎవరికివారికి విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయించాలరా విజ్ఞప్తి చేశారు. బాక్స్డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, కమ్యునిటీహాల్ నిర్మాణం ఏర్పాటు చేయించాలని కోరారు.
కిందిబస్తీ, కుమ్మరిబస్తీ, మంగలిబస్తీలలో సీసీ రోడ్డును వేయించాలని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. అలాగే కల్వరి లైన్ యాప్రాల్లో ముస్లింమ్స్ స్మశానవాటిక, మసీద్కు ప్రహరీ గోడను నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.