మల్కాజిగిరి, జనవరి 21: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ భవన్లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నాయకుల సన్నాహక సమావేశానికి పార్టీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 50వేల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిందని అన్నారు.
ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరిచే స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి మభ్యపెట్టే అవకాశం ఉంద ని, ప్రజలు నమ్మరని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, బద్దం పరశురాంరెడ్డి, అనిల్కిశోర్, ఉపేందర్ రెడ్డి, వీఎస్ రాజు, లోకేశ్, వీణ, నిర్మల, జార్జి, రాజేందర్, అరుణ్, సాయిరాం, సింధు, షీరంగిరి, ప్రశాంత్, దేవయ్య గౌడ్, అనంత, ప్రభాకర్, ముత్యాలు, లింగమ్, ఈశ్వర్గౌడ్, వీరేశ్, విజయశేఖర్, జనార్దన్, బాలి, సురేశ్, రామకృష్ణ, సోమయ్య, కలాసి పాల్గొన్నారు.