మల్కాజిగిరి, సెప్టెంబర్ 9: అంగన్వాడీ సెంటర్ల(Anganwadi centers) సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Marri Rajasekhar Reddy) అన్నారు. సోమవారం బోయిన్పల్లి క్యాంప్ కార్యాల యంలో అల్వాల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లి, పిల్లల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న టీచర్లు, సూపర్వైజర్లు అభినందనీయులని అన్నారు.
టీచర్లు, సూపర్వైజర్ల సమస్యలు పరిష్కరిస్తామని, నెలనెల టీచర్ల సమావేశాల కోసం ప్రభుత్వ పరంగా కొత్త భవననిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 77 అంగన్వాడీ సెటర్లలో నీటి సదుపాయం, బాత్రూమ్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ స్వాతి, సూపర్ వైజర్లు జమశీల, వింధ్యావాహిని, టీచర్లు మీనాక్షి, రాణి, మమత, రాజ్యలక్ష్మి, శోభారాణి, రమదేవి, విజయలక్ష్మి, సంధ్యా, భాగ్యరేఖ, తదితరులు పాల్గొన్నారు.