మల్కాజిగిరి, డిసెంబర్ 17: వరద ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ సత్తిరెడ్డి కాలనీ, సత్య రాఘవేంద్రకాలనీ, బీజేఆర్ నగర్ కాలనీల్లో ఎమ్మెల్యే పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇప్పటికే బండ చెరువు పరీవాహక ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. వరద నీటిని పైపుల ద్వారా లాలాపేట్ శాంతినగర్ నాలాలో కలపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్ 5వ వార్డు కార్పొరేటర్ ఏకే మురుగేశ్, కేబుల్ రమేశ్, నవీన్యాదవ్, జంగరాజు, వెంకట్, సైదులు, నర్సింగ్, భగవత్రెడ్డి, అశోక్, మహేందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కలిసి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి వెంకటాపురం డివిజన్లో కృషి చేసిన కార్పొరేటర్ సబితాకిశోర్, అనిల్కిశోర్లను ఎమ్మెల్యే సన్మానించారు. కార్పొరేటర్ సబితాకిశోర్, అనిల్కిశోర్, సయ్యద్ మోసిన్, ప్రభాకర్ పాల్గొన్నారు.
పేదలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరి సర్కిల్లో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్లతో కలిసి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఇండ్లలో ఆడబిడ్డల తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లిలు చేస్తున్నట్లు గుర్తించిన తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి -షాదీముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం అందజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, అనిల్కిశోర్, చింతల శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ మోసిన్, పుదారి రాజేశ్కన్న, ప్రభాకర్, శ్రీధర్గౌడ్, ప్రేమ్, హరి, వీఎన్ రాజు, సన్దిప్, వీణ, రేణుక, రహమత్ పాల్గొన్నారు.