బోయిన్ పల్లిలోని కార్యా లయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి, డిసెంబర్ 19: అధికారులు సమన్వయంతో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్లోని వివిధ విభాగాల అధికారులతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాటర్ వర్క్స్ అధికారులు ప్రజలకు నీటికి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
పారిశుధ్య పనులను నిర్లక్ష్యం చేస్తే ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఉదయాన్నే పారిశుధ్య కార్మికులతో కలసి అధికారులు పారిశుధ్య నిర్వహణను పరిశీలించాలని అన్నా రు. ట్రేడ్ లైసెన్స్లను సకాలంలో రెన్యూవల్ చేయక ముందు మరోసారి తనిఖీలుచేసి సంతృప్తి చెందితే తప్ప రెన్యూవల్ చేయ కుండా తగిన మార్పులు చేసిన తర్వాతనే రెన్యూవల్ చేయాలని అన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని కలసి లైసెన్స్ తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు.
పేదల ఆరోగ్యం కాపాడడానికి బస్తీలలో కేసీఆర్ ప్రభు త్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిందని, ఆరోగ్య శాఖ సిబ్బం ది వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణుల పేర్లు నమోదు చేసుకుని ప్రసవాలను ప్రభుత్వ దవాఖానలో చేసుకునే మాదిరిగా ప్రోత్సహించాలని అన్నారు. ఎంటమాలజీ అధికారులు దోమల నివారణ కోసం కాలనీలలో ఫాగింగ్ చేయాలని, చెరువుల్లో దోమలు పెరగకుండా రసాయనాలను డ్రోన్లతో చల్లాలని అన్నారు.
రెవెన్యూ అధికా రులు భూసమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పౌర సేవా కేంద్రాలు సమస్యలను గుర్తించి సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం సునీల్, ఈఈ రాజు, తదితరులు పాల్గొన్నారు.