బంజారాహిల్స్ : అనారోగ్యంతో బాధపడుతున్న వెంగళరావునగర్ డివిజన్కు చెందిన శివ అనే వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.35వేల చెక్కును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్యరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.