బంజారాహిల్స్,ఆగస్టు 24 : అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వెంగళరావునగర్ డివిజన్కు చెందిన ఎం.హర్షితకు రూ.60వేలు, ఎస్.నాగరాజుకు రూ.33,500, సోఫియా లారెన్స్కు రూ.24వేల చెక్కును ఎమ్మెల్యే మాగంటి అందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్యరావు, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్, వేణు, శ్యాంరావు, వేణుగోపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.