బంజారాహిల్స్,జూలై 29: బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్లకు సూచించారు. బోనాల ఏర్పాట్లపై జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్కుమా ర్ పటేల్తో పాటు పలు డివిజన్లకు చెందిన ఆలయ నిర్వాహకులతో గురువారం సమావేశం నిర్వహించారు. బోనాలకు ముందే అన్ని ఆలయాల వద్ద డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, రోడ్లకు మరమ్మతులు, క్లీనింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులు చేయించాలని సూచించారు. బోనాల రోజున ఆలయాలవద్ద ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, దుర్గం ప్రదీప్, చిన్న రమేశ్ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్,జూలై29: మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం ఎర్రగడ్డ డివిజన్ గోకుల్ వీధిలో కంజర్ల పల్లవి, మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి పూజలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడంతో మన సంస్కృతి అద్దం పడుతుందన్నారు. బోనాల పండుగల నిర్వహణలో భ క్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాలకు కావాల్సిన నిధులు సమకూర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, వార్డు సభ్యుడు రాము, సీనియర్ నాయకులు గంట మల్లేశ్, సాయిరూపేశ్, శ్రీకాంత్ గౌడ్, అనిల్ గౌడ్, సంతోశ్ గౌడ్, బాలు, రాములు, సోమ్నాథ్ నాయక్, రాజు, దాసి, శ్రీకాంత్, నరేశ్, మహిళ అధ్యక్షురాలు కళ్యాణి, సుధ, సుజాత, జులేఖ, రాణి, తదితరులు పాల్గొన్నారు.