కవాడిగూడ, సెస్టెంబర్ 9: వర్షాకాల దృష్ఠ్యా లోతట్టు నాలా పరీవాహక ప్రాంతాలలో ఉన్న బస్తీవాసులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని గోషాల, నాలా ప్రాంత బస్తీలలోని అంబేద్కర్నగర్, మారుతీనగర్, ఎల్ఐసీ బ్రిడ్జీ, సబర్మతీనగర్, అశోక్నగర్ బ్రిడ్జీ ప్రాంతాలతో పాటు ఇందిరాపార్కులోని పలు అభివృద్ధి పనులను ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జోనల్ కమిషనర్ రవికిరణ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, జీహెచ్ఎంసీ వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్థానిక బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నాలా ప్రాంత ప్రజలను అన్ని విధా లా ఆదుకుంటామని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ..
హుస్సేన్సాగర్ నాలా పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న వారు శిథిలావస్థలో ఉన్న వారి ఇండ్లను ఖాళీ చేయాలని, లేని పక్షంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. గతంలోనే ఓ మహిళ నాలాలో పడి మృతిచెందిన విషయం తెలిసిందేనని అన్నారు. మృతి చెందిన మహిళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందేట్లు చూస్తామని అన్నారు. అదే విధం గా ఇందిరాపార్కులో స్కేటింగ్, బోటింగ్, షటిల్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధుల పట్ల నిరక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, ఇంజినీరింగ్ విభాగం ఈఈ గోపాల్, సర్కిల్-15 డీఎంసీ తిప్పర్తి యాదయ్య, ఏఎంహెచ్ఓ మైత్రేయి, డీఈ సన్ని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, సీనియర్ నాయకుడు ఆర్. రాజేశ్, లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు శంకర్ గౌడ్, ప్రభాకర్, శంకర్ ముదిరాజ్, ముఠా శివసింహ, మధు, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.