కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 4 : బాలాజీనగర్ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామని అంతర్గత రోడ్లన్నింటినీ సీసీరోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. మంగళవారం బాలాజీనగర్ డివిజన్లో రూ.2.20 కోట్లతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శిరీషాబాబురావు శంకుస్థాపన చేశారు. కేపీహెచ్బీ కాలనీలోని వేంకటేశ్వర నిలయం రోడ్డులో.. శాంతినిలయం నుంచి పవన్ ఆర్కేడ్ వరకు, ట్రినిటీ హోమ్స్ రోడ్డులో, హౌసింగ్బోర్డు పార్కు రోడ్డులో, కైత్లాపూర్లో, ప్రగతినగర్లో, ముష్కిపేటలో చేపట్టనున్న సీసీరోడ్డు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలలో పురాతన కాలంనాటి డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్, అంతర్గత రోడ్డు వ్యవస్థలు దెబ్బతినడం వల్ల వాటన్నింటినీ పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలను ఆధునీకరించడం జరిగిందని తద్వారా కలుషిత నీటి సరఫరా, డ్రైనేజీ పొంగిపొర్లే సమస్యలు దాదాపుగా తీరాయన్నారు. అభివృద్ధి పనులు, వర్షాలతో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ సీసీరోడ్లుగా పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాలనీలు బస్తీలలో 90శాతం పనులను పూర్తిచేయడం జరిగిందని.. ఈ పనులన్నీ పూర్తైతే సమస్యలు దాదాపుగా తీరుతాయన్నారు.
బాలాజీనగర్ డివిజన్ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక పార్కులు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కుటుంబమంతా ఆహ్లాదకరంగా గడిపేలా పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని వెంటనే నిధులు మంజూరు చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఇప్పటికే చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, కార్యదర్శి వెంకటేశ్ చౌదరి, జీహెచ్ఎంసీ ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, ఏఈ శ్రీనివాస్ ఉన్నారు.