బేగంపేట్, అక్టోబర్ 30 : బేగంపేట్లో తొమ్మదిన్నరేండ్లలో 90 శాతం సమస్యలను పరిష్కరించామని కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బేగంపేట్ డివిజన్ ఫంక్షన్ విల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో మౌలిక వసతులకు పెద్దపీట వేశానన్నారు. తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ముంపు ప్రాంతమైన బేగంపేట్కు ఓ సారి పడవలో వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అటువంటి ప్రాంతంలో కోట్లాది రూపాయలతో నాలా ప్రక్షాళన చేపట్టి సమస్యను పరిష్కరించామన్నారు.
కేసులకు భయపడకుండా హెచ్పీఎస్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని శ్మశాన వాటిక కోసం కేటాయించి ఏళ్లనాటి సమస్యను తీర్చామన్నారు. ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్లో బీజేపీ నాయకులు అడ్డుకున్నప్పటికి సివరేజ్, రోడ్డును నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి, నాయకులు శ్రీహరి, సురేశ్ యాదవ్ పాల్గొన్నారు.