దుండిగల్: ‘సర్’ పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ ఓటరు సవరణ జాబితా రూపకల్పన విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు, బూత్ లెవల్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.