బాలానగర్ , ఏప్రిల్ 2 : మల్కాజిగిరిలో(Malkajigiri) పార్లమెంట్ బీఆర్ఎస్(BRS ) అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం సాధించడం ఖాయమని, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishnarao) అన్నారు. మంగళవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని మల్లికార్జునకాలనీలోని స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సిం హ యాదవ్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి రాగిడి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం బీఆర్ఎస్తోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాటలు తప్పా చేతలు లేవన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం మైనార్టీ నాయకులు సయ్యద్ ఎజాజ్, మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగ్, సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, బల్వంత్రెడ్డి, నరేందర్గౌడ్, ఇర్ఫాన్, హరినాథ్లతో పాటు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.