కుత్బుల్లాపూర్,మార్చి18 : దేవాలయాల సందర్శనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. సోమవారం జీడిమెట్ల డివిజన్ పరిధి గోదావరి హోమ్స్ వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) దేవస్థానంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavalu) ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీనివాసుడి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు. గత ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్దిరాములు, సుధాకర్గౌడ్, గుమ్మడి మధుసూదన్రాజు, నరేందర్రెడ్డి, సమ్మయ్య నేత, కాలె నాగేశ్, ఎల్లాగౌడ్, విజయహరీశ్, తదితరులు పాల్గొన్నారు.