దుండిగల్/కుత్బుల్లాపూర్/జీడిమెట్ల, జూన్ 20: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ .. విద్యారంగానికి పెద్దపీట వేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి, సూరారం, నిజాంపేట్, చింతల్ భగత్సింగ్నగర్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే వివేకానంద్ హాజరయ్యారు. ఆయా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మౌలిక వసతు లు, డిజిటల్ క్లాస్రూంలను కొంపల్లి చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలాగోపా ల్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న నోట్, టెక్ట్స్బుక్స్తో పాటు రెండు జతల యూనిఫాంలను అందించారు. అనంతరం ‘రాగిజావ’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు చెం దిన విద్యార్థులు ‘థంక్యూ కేసీఆర్ సార్’ అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారన్నారు. విద్యారంగంలో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించి, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేశారన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 108 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో 21 ఉన్నత, 1ప్రాథమికోన్నత, 86 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయన్నారు. 21 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని, మన ఊరు-మన బడి కార్యక్రమం కింద సొంతభవనాలు, మౌలికవసతులు, అవసరమైన స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. తన తండ్రి కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.కోటి విరాళంతో కేఎం పాండు మెమోరియల్ గవర్నమెంట్ ఒకేషనల్ జూనియర్ కళాశాల రెండస్తుల భవనంను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. దీనిని అతి త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధన్రాజ్యాదవ్, కమిషనర్లు శ్రీహరి, సత్యనారాయణ, రామకృష్ణారావు, ఎంఆర్పీ రమేశ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతి నిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.