దుండిగల్, జూలై 14: అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, నియోజవర్గ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులును ఆదేశించారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ ఏ, బీ బస్తీల్లో ఎమ్మెల్యే వివేకానంద్ శుక్రవారం ప్రగతియాత్రలో భాగంగా 89వ రోజు నిర్వహించారు. స్థానిక నేతలు, అధికారులతో కలిసి ఆయా బస్తీల్లో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించి ఇప్పటికే పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కాగా ఆయా బస్తీల్లో కొన్నిచోట్ల తాగునీటి సమస్య ఉందని, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరడంతో పాటు విద్యుత్ కేబుల్ వైర్లను మార్చాలని స్థానికులు కోరడంతో అక్కడే ఉన్న సంబంధిత అధికారులను వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలను అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి నిధుల కొరతలేదని, ప్రజలకు అవసరమైన చోట మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. ఈ సం దర్భంగా స్థానికులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించగా మహిళలు, వృద్ధులు ఎమ్మెల్యే పట్ల ఆప్యాయంగా స్పం దించారు. ఈ కార్యక్రమంలో వాటర్వర్క్స్ డీజీఎం అప్పలనాయుడు, బీఆర్ఎస్ నేతలు రషీద్బేగ్, అంజన్గౌడ్, కమలాకర్, ఇబ్రహీం, మూసాఖాన్, సింగారం మల్లేశ్, ఇమ్రాన్బేగ్, షభానతో పాటు బస్తీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్తో ఆర్థిక చేయూత: ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్, జూలై 14: నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం చింతల్ క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 39 మంది నిరుపేద కుటుంబాలకు రూ.21 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద, మద్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్యరీత్యా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నిధి కింద కొంతమేరకు అందించి ఆర్థికంగా చేయూతను అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుపేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్యాదవ్తో పాటు ఆయా డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా.. నిరంతరం వారికి చేరువ లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తగు చర్యలు తీసుకుంటున్నాని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన సంక్షేమ కాలనీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి తమ కాలనీల్లో నెలకొన్న పలు సమస్యలతో పాటు మౌలిక వసతులను కల్పించాలని వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో ఫోన్లైన్లో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
కొంపల్లిలో దుర్గామాత ఆలయంలో జరిగిన అమ్మవారి కల్యాణ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో పాటు మాజీ ఎంపీపీ సన్న కవిత తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.