కుత్బుల్లాపూర్,ఫిబ్రవరి24: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నేరుగా ప్రగతియాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా 132 జీడిమెట్ల డివిజన్ వెన్నలగడ్డ, ప్రశాంత్నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వాటిని సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎస్ఎన్డీపీలో భాగంగా గోదావరి హోమ్స్లో రూ.69 కోట్లతో నాలాల అభివృద్ధి, మరో రూ.40 లక్షలతో పార్కుల అభివృద్ధి నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు జ్ఞానేశ్వర్ముదిరాజ్, సంపత్మాధవరెడ్డి, కుంట సిద్దిరాములు, గుమ్మడి మధుసూదన్రాజ్, ఇందిరారెడ్డి, నరేందర్రెడ్డి, కనకయ్య, అరుణారెడ్డి, నాగేశ్, మల్లేశ్, సదీమ్రాయ్, కాలే గణేశ్, సమ్మయ్యనేత, శ్రీధర్, సమీర్సింగ్, దేవేందర్, శ్రీకాంత్, ప్రసాద్, నాగేశ్రెడ్డి, సంధ్య, శివముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.