అంబర్పేట, మార్చి 2 4 : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాక డివిజన్ పరిధిలోని కమలానగర్, న్యూ కమలానగర్ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఉచిత సిలిండర్, ఉచిత విద్యుత్తు, పింఛన్లు సరిగ్గా రావడం లేదని, వీధి లైట్లు వెలగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత విభాగాల అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంతోష్, కిషన్సింగ్, బక్కయ్య, మహేష్, రాజు, యాదగిరి, జగన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.