అంబర్పేట, మే 30 : అంబర్పేట నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో ఉన్న బస్తీలు, కాలనీల్లో కోట్లాది రూపాయలతో మంచినీటి పైపులైన్ పనులు చేపట్టినట్లు చెప్పారు. బాగ్అంబర్పేట డివిజన్ ఎరుకల బస్తీలో రూ.6.50 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని చోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త మంచినీటి పైపులైన్ పనులతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా విరివిగా చేపడుతున్నామన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కలుషిత మంచినీటి సమస్య నుంచి ప్రజలను పూర్తిగా విముక్తి చేసేందుకు అన్నిచోట్ల కొత్త పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం బస్తీలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే దాని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాటర్వర్క్స్ డీజీఎం విష్ణువర్ధన్రావు, మేనేజర్ మాజిద్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి కెంచె మహేశ్, సీనియర్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, అఫ్రోజ్పటేల్, పి.గెల్వయ్య, శివాజీయాదవ్, రమేశ్నాయక్, ఈఎస్ ధనుంజయ, రాజేశ్, బాబు, బొట్టు శ్రీను, బంగారు శ్రీను, ఉప్పు సుధాకర్, చంద్రమౌళి, స్వామి, కిశోర్, ప్రసూన, నవీన్యాదవ్, శ్రీనివాస్యాదవ్, ప్రదీప్, జమ్మిశెట్టి బాల్రాజు, శ్రీహరి, నరహరి తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాలి
అంబర్పేట, మే 30 : దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం సాయంత్రం వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. నేడు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరోసారి చరిత్ర సృష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈ.విజయ్కుమార్గౌడ్, దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, డీసీ వేణుగోపాల్, అంబర్పేట తాసీల్దార్ సీహెచ్ లలిత, డీపీవో రజిత, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు అశోక్, మొగిలిచెర్ల రవి, కిషన్, టౌన్ప్లానింగ్ ఏసీపీ సాయిబాబా, సీపీడీవో జ్యోత్స్న, ఏడీఈ సీనయ్య, డిప్యూటీ ఐఓఎస్ నిజాముద్దీన్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సత్యానగర్ సమగ్రాభివృద్ధికి కృషి
అంబర్పేట, మే 30 : నల్లకుంట డివిజన్ సత్యానగర్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం డివిజన్లోని సత్యానగర్ ఒకటి, రెండో ఫేజ్లలో అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. స్థానికుల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మంచినీరు, డ్రైనేజీ సమస్యలతో పాటు రోడ్ల సమస్యను చెప్పారు. వీధి దీపాల సమస్యకు తెలిపారు. వరద ముంపు సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
వీటికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులతో చెప్పి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్వర్క్స్ మేనేజర్ భావన, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, నాయకులు గాలపల్లి శంకర్, కిషన్రావు తదితరులు పాల్గొన్నారు.