అంబర్పేట, నవంబర్ 7: బీజేపీలో ఎవరూ లేనట్టు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కిషన్రెడ్డి టికెట్ కేటాయించారని.. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్లోని జైస్వాల్ గార్డెన్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం గోల్నాక డివిజన్ కార్పెంటర్స్ అసోసియేషన్ (ఫెవికాల్ చాంపియన్ క్లబ్) ప్రతినిధులు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తితో కలిసి కిషన్రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రచారంలో పాల్గొంటారో ఆలోచించుకోవాలన్నారు.