అంబర్పేట, జనవరి 11: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం ఓల్డ్ నల్లకుంటలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్లకుంట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే వెంకటేశ్ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని, కాలనీల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు శేఖర్రెడ్డి, నర్సింహచారి, గోపి, చంద్రకాంత్, రోహిత్రెడ్డి, ఆకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లకుంట డివిజన్ తిలక్నగర్ ఎమ్మార్సీబీ పక్క గల్లీలో గురువారం చెట్టు కూలింది. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే వెంకటేశ్ దృష్టి కితెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంట నే డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించి కూలిన చెట్టు కొమ్మలను తొలగింపచేశారు.