గోల్నాక : పేదలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూతనందిస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక క్యాంపు కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన.. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చికిత్స పొందిన 28 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన రూ.10 లక్షల 32 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం చేయడంతో ఈ పథకం వరంలా మారిందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చెప్పారు.