బోరబండ డిసెంబర్ 25: లోక కల్యాణం కోసం శిలువను మోసిన మహనీయుడు యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్ స్వరాజ్నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నేత విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకానికి ప్రేమ, దయ, కరుణను పంచిన యేసు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును ఏర్పాటు చేసి, క్రైస్తవులకు కానుకలను ఏటా అందజేస్తున్న సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సముచిత గౌరవాన్నిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి సయ్యద్సిరాజ్, ఏడీ మధు, మహ్మద్యూసుఫ్, ఆనంద్, వెంకటేశ్, రజ్వి తదితరులు పాల్గొన్నారు.