మన్సూరాబాద్, జూలై 31: పర్యావరణానికి అనుగుణంగా అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మహా ప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధి ఫతుల్లాగూడలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.18కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పనులను శనివారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం, క్రైస్తవుల కోసం శ్మశానవాటికను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అపరకర్మలు నిర్వహించుకునేందుకు బ్రాహ్మణుల కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మహా ప్రస్థానంలో విశాలమైన హాల్తో పాటు స్నానాల గదులు, మూత్ర శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్మశానవాటికలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించి చక్కని వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.