కుండపోత వర్షానికి ఎల్బీనగర్ నియోజకవర్గం నీట మునిగింది. చెరువుల దిగువన ఉన్న ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంపు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదముంపునకు గురైన ప్రాంతా ల్లో ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి పర్యటించి బాధితులకు సహాయం చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, ఉప కమిషనర్లతో పాటుగా ఎమర్జెన్సీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.