మన్సూరాబాద్, అక్టోబర్ 17: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక సమన్వయ కమిటీ నాయకులు తూర్పాటి చిరంజీవి, ఆడాల రమేశ్, జోగురాములు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి మద్దతుగా ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక సమన్వయ కమిటీ నాయకుడు చెంగల్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ పరిధి వీకర్సెక్షన్కాలనీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి వారు హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
నిరుపేదలైన దళితులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు వలన ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి లభించిందని తెలిపారు. నగర నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించారని తెలిపారు. కొత్తగా నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో నామకరణం చేసి దళితుల పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో దళితులందరూ బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలిపి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్రాల స్వామి, మల్లెపాక యాదగిరి, పార్శపు శ్రీధర్, రాజేందర్, రాసమల్ల శ్రీనివాస్, బాలాజీ గైక్వాడ్, ఏర్పుల యాదయ్య, యంజాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి మద్దతుగా హయత్నగర్ పరిధి బాలాజీనగర్, శ్రీరామ్నగర్, ఎల్లారెడ్డికాలనీల్లో మంగళవారం డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కొసనం వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పదేండ్ల కాలంలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ చేపడుతున్న ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని తెలిపారు. ఎల్బీనగర్ అభివృద్ధే లక్ష్యంగా పని చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు వాగ్ధానం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కవిత, తేజస్విని, స్వాతిరెడ్డి, పద్మ, మాలతి, శైలజ, రాధిక, సుస్మిత, పారిజాత, నర్మదా, లీలా, కల్పజా, సాయికుమారి, తదితరులు పాల్గొన్నారు.