హయత్నగర్, జూలై 1 : కొన్నేండ్లుగా కొనసాగుతున్న ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు జరగాలంటే.. మీ అందరి సహకారం కావాలని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. శనివారం హైకోర్టు కాలనీ సంక్షేమ సంఘం భవనంలో ఈస్టెర్న్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం తూర్పు 22 కాలనీల సంయుక్త సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీదివాకర్, హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ద్వారకామయినగర్ కాలనీ కమాన్ వద్ద విజయవాడ జాతీయ రహదారి పక్కన కొనసాగుతున్న ఇసుక, ఇటుక లారీల అడ్డా కారణంగా చుట్టుపక్కల కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రెండు కుటుంబాల స్వార్థం వల్ల రెండు వేల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. ఇసుక లారీల అడ్డా స్థలం ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినదని, వారి ముర్ఖత్వపు ఆలోచనల వల్ల స్థానికులు అవస్థలకు గురవుతున్నారని పేర్కొన్నారు. చుట్టుపక్కల కాలనీలకు వెళ్లే రోడ్లలో ఏర్పాటైన షెడ్ల వద్ద ఇసుక లారీలను పార్కింగ్ చేయడం వల్ల మహిళలు రాత్రిళ్లు అక్కడి నుంచి వెళ్లలేని దుస్థితి దాపురించిందన్నారు. ఆటోనగర్ వద్ద రోడ్లపై ఇసుక లారీలు నిలుపకుండా పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ తీసుకొస్తానని హామీనిచ్చారు. రానున్న రోజుల్లో ఇసుక లారీల అడ్డా తొలగింపు లక్ష్యం నెరవేరుస్తానన్నారు.
కాలనీల్లో రోడ్లపై పార్కింగ్ సమస్య పరిష్కారానికి కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు తమవంతు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇతరుల వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లపైకి వచ్చిన ర్యాంపులు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో అతిభారీ వర్షాలకు నగరంలోనే ఎల్బీనగర్ నియోజకవర్గం పూర్తిస్థాయి ముంపునకు గురైన సంగతి తెలిసిందేనని, వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ఎస్ఎన్డీపీ నాలాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. మరికొన్ని చోట్ల పైపులైన్లు ఏర్పాటు చేసి వాటిని ఎస్ఎన్డీపీ నాలాల్లో కలిపించేందుకు చర్యలు చేపడుతామని వివరించారు. హరిణ వనస్థలి పార్కు ఎదుట ప్రాసిక్యూషన్ దందాను అరికడుతామని, స్పెషల్ డ్రైవ్ ద్వారా రోడ్లపై పార్కింగ్ చేస్తున్న లారీలకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. డీర్ పార్కు వద్ద అత్యాధునిక వసతులతో బస్షెల్టర్ను నిర్మించేందుకు కృషిచేస్తున్నామని, దీన్ని కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కానీ అత్యాధునిక బస్షెల్టర్ నిర్మాణ పనులను జరిపి తీరుతామని సవాల్ విసిరారు. విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరగడం వల్ల భాగ్యలత వద్ద రోడ్డును దాటేందుకు వీల్లేకుండా పోయిందన్నారు. పాదాచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. దీంతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందన్నారు. ఆటోనగర్ నుంచి హయత్నగర్ వరకు రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నూతనంగా రానున్నాయని, ఫిల్లర్లతో కూడిన నిర్మాణం చేపట్టేవిధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
రానున్న రోజుల్లో విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతాయని, మెయిన్ రోడ్డు, సర్వీసు రోడ్డు, సైకిల్ ట్రాక్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతాయని వెల్లడించారు. సుష్మాసాయినగర్ కాలనీ వద్దనున్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తరలింపునకు కూడా తనవంతు కృషిచేస్తానని హామీనిచ్చారు. హయత్నగర్ డివిజన్ పరిధిలో డ్రైనేజీ అవుట్లెట్ కోసం 13 కిలోమీటర్లకు గాను 10 కిలోమీటర్లు నిర్మాణ పనులు చేపట్టామని, జూలై ఆఖరు నాటికి మిగతా మూడు కిలోమీటర్ల పనులు పూర్తవుతాయని స్పష్టంచేశారు. ఎన్నికల అనంతరం ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోరైలు పొడిగింపునకు సీఎం కేసీఆర్ తొలిసంతకం చేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ హరికృష్ణ, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్, అధికారిణి వాహిని, హయత్నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, మన్సురాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, ఈస్టెర్న్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దీపావళి శ్రావణ్కుమార్, జనరల్ సెక్రటరీ గుత్తా లక్ష్మణ్రెడ్డి, ట్రెజరర్ బాదం శ్రీనివాసులు, అసోసియేషన్ నాయకులు వి.సుదర్శన్రెడ్డి, కేఎల్.నర్సింహారావు, ఉపాధ్యక్షులు బి.మధుసూదన్రెడ్డి, పి.సుధాకర్రెడ్డి, భరత్సింగ్, జాయింట్ సెక్రటరీస్ నాగిరెడ్డి, సుధీర్రెడ్డి, దీపావళిల శ్రీకాంత్, బి.జలేందర్, ఎన్.ప్రవీణ్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ కె.బాలరాజ్ గౌడ్, కె.చంద్రశేఖర్రెడ్డి, ఎన్.సునీల్ కుమార్, పి.మాధవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ హయత్నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యానాల కృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంజలిగౌడ్, సీనియర్ నాయకులు ఏర్పుల దేవప్రసన్నకుమార్, ఉమా యాదవ్, యాదమ్మ చారి తదితరులు పాల్గొన్నారు.
శివారు కాలనీల్లో దశలవారీగా అభివృద్ధి పనులు
శివారు కాలనీల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి అమ్మదయకాలనీ, జడ్జెస్కాలనీ, వినాయక్నగర్ కాలనీ ఫేజ్-1లో రూ.78లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శనివారం స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్జెస్కాలనీ అధ్యక్షుడు వట్టి చంద్రారెడ్డి, కార్యదర్శి జనార్దన్రావు, కోశాధికారి కాలివర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు టంగుటూరి నాగరాజు, రవికుమార్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్రెడ్డి, అమ్మదయకాలనీ అధ్యక్షుడు పి.శంకర్, కార్యదర్శి శ్రీశైలం, గౌరవ అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు రఘునందన్, కోశాధికారి వెంకట్యాదవ్, వినాయక్నగర్ కాలనీ అధ్యక్షుడు కళ్లెం శంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జెట్టా మహేశ్వర్, నాయకులు పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, కుంట్లూరు వెంకటేశ్గౌడ్, పోచబోయిన జగదీశ్యాదవ్, జక్కిడి రఘువీర్రెడ్డి, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్న కురుమ, అత్తాపురం రాంచంద్రారెడ్డి, నాంపల్లి శంకరయ్య, నాంపల్లి రామేశ్వర్, బాలరాజు గౌడ్, విజయభాస్కర్రెడ్డి, యంజాల జగన్, కంచర్ల రాకేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.