225 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు
పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
ఎల్బీనగర్, మార్చి 17 : సీఎం కేసీఆర్ చలువతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదలపై పెండ్లిళ్ల భారం తగ్గిందని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 225 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్గుప్తాలతో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ డిప్యూటీ తాసీల్దార్ కృష్ణ, ఆర్ఐలు నర్సింహయాదవ్, ప్రసాద్, వీఆర్ఓ జగదీశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.