Shamirpet | శామీర్పేట, ఏప్రిల్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువుకాటకాలకు నెలవని, తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్నదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తరపున శనివారం ఎన్నికల ప్రచారం చేస్తూ..రైతు సమస్యలపై పోస్టుకార్డుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు రూ.15 వేలు ఇస్తామని ఆశచూపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు సరైన కరెంటు, రైతుబంధు, సాగునీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్రెడ్డి, రైతులు దత్తుగౌడ్, రవీందర్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.