ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి.. 60 మంది లబ్ధిదారులకు ‘దళిత బంధు’ మంజూరు పత్రాలు అందజేత
ఉప్పల్, రామంతాపూర్, ఏప్రిల్ 5 : దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడ క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు , తాసీల్దార్ గౌతం కుమార్ తో కలసి 60 మంది దళితులకు ‘దళిత బంధు’ మంజూ రు పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సాహసంతో ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పథకం పొందిన దళితులు దళిత యువతకు ఉపాధి కల్పించాలన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయసాధనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి సాయిజెన్ శేఖర్, బన్నా ల గీతా ప్రవీణ్ ముదిరాజ్, స్వర్ణరాజ్, ప్రభుదాసు, నాయకులు డాక్టర్ బీవీచారి, బేతి సుమంత్రెడ్డి, గడ్డం రవికుమార్, పల్లె నర్సింగ్రావు, లక్ష్మీనారాయణ, బద్దం భాస్కర్రెడ్డి, ముత్యం రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, యాదమ్మ, గరిక సుధాకర్, నం దికంటి శివ, చర్లపల్లి కాలనీల సమాక్య ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, ముస్తాక్, మస్కా సుధాకర్, చింతల నర్సింహరెడ్డి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు