ఉప్పల్, జూలై 26 : ఉప్పల్ ప్రధాన రహదారి సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్-వరంగల్ జాతీయ రహదారిలో ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై గుంతలు, నీటి నిల్వల సమస్యలను పరిశీలించారు. ఈ మేరకు సంబంధిత అధికారు లను పిలిపించి, సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డుపై నీరు నిల్వకుండా తక్షణ చర్యలు చేపట్టేవిధంగా పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రహదారి సమస్యలు తక్షణం పరిష్కరించేవిధంగా పనులు చేపడతామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు పను లు సత్వరం పూర్తి చేస్తామని అన్నారు. ప్రధాన రహదారికి రెండువైపులా బీటీ రోడ్డును పూర్తి చేస్తామన్నారు. ఇటీవలే సంబంధిత శాఖల అధికారులతో మాట్లామని, పను లు చేపడతామని తెలిపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆలస్యమైన పనులను తెలంగా ణ ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్రావు, సీఐ అశోక్, ప్రాజెక్టు మేనేజర్ అశోక్ బంగర్, ఆర్అండ్బీ ఏఈ గోపికృష్ణ, ఉప్పల్ ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.