కాప్రా, సెప్టెంబర్ 1 : పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా మట్టివినాయక విగ్రహాల పంపిణీని ప్రోత్సహించడం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్కు చెందిన సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మహేందర్ ఎమ్మెల్యే బండారిలక్ష్మారెడ్డిని సైనిక్పురిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మట్టి వినాయకుడిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మట్టివినాయకులను పూజించడం ద్వారా పండుగ సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని అన్నారు.
మట్టివినాయక విగ్రహాలను ప్రోత్సహించి పంపిణీ చేయడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. దేవుళ్లలో ఆది దేవుడు, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, భక్తుల కోరికలను తీర్చే గణనాథుడు శ్రీవినాయకుడి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.