మియాపూర్ , డిసెంబరు 24 : ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాలకు గురైన పేదలకు సీఎం సహాయ నిధి పథకం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొంది తమ అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన అరుణ అత్యవసర వైద్య సేవల నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద రూ. లక్ష ఆర్థిక సాయం మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గాంధీ ఆదివారం తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే గాంధీ కోరారు. ఎల్లం నాయుడు, బాలు పాల్గొన్నారు..
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలో ఆదివారం జరిగిన గ్యార్వీ షరీఫ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల నడుమ సామరస్యంతో నిర్వహించుకోవాలని సూచించారు. ఎవరి మతాచారాలను వారు ఆచరిస్తూ ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చంద్రకాంత్రావు, కాశీనాథ్, ఎల్లం నాయుడు , సమ్మద్, కరీం, గౌ స్ , ఖాజా, గౌస్, బడే ఖాజా, మున్నా పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని క్రిస్టియన్లకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ క్రిస్ట్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు. చిర్చిల్లో ప్రార్థనలు, వేడుకల నిర్వహణకు చర్చిల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. శాంతియుత బోధనలను ఆచరిస్తూ సోదరభావంతో ముందుకు సాగాలని గాంధీ పిలుపునిచ్చారు.