మియాపూర్ , మార్చి 26 : స్వరాష్ట్రంలో ప్రజలకు గులాబీ జెండా అండగా నిలిచిందని తానున్నాన్న సంపూర్ణ భరోసాను కల్పించిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్నదన్నారు. కూకట్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం అశోకా గార్డెన్స్లో ఆదివారం సాయంత్రం జరిగింది.
కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ… లక్షలాది పార్టీ సైనికుల బలంతో బీఆర్ఎస్ అత్యంత బలమైన శక్తిగా దూసుకుపోతున్నదన్నారు. కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… తమ డివిజన్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సగభాగమే ఉన్నా…అభివృద్ధి విషయంలో పూర్తి తోడ్పాటు లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూకట్పల్లి డివిజన్ ప్రగతి నివేదికను విప్ గాంధీ సమావేశంలో కూలంకషంగా వివరించారు.
వివేకానందనగర్లో..
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన శనివారం అశోక గార్డెన్స్లో ఆదివారం జరిగింది. డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకున్నదని, ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదన్నారు. విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలే తన పూర్తిస్థాయి బలమన్నారు. వారిని కండ్లలో పెట్టుకుని చూసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం నుంచే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, మహిళా నేతలు, వార్డు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఆయా కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.