BRS | మియాపూర్ , ఏప్రిల్ 7 : చేవెళ్లలో ఈనెల 13న జరుగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ శ్రేణులకు పిలు పునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే తన నివాసం లో కార్పొరేటర్లు హమీద్పటేల్, రాగం నాగేందర్యాదవ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస్రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాధవరం రోజాదేవి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, రం గారావు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, అభ్యర్థి కాసానితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ గతంలో ప్రజా ప్రతినిధిగా ప్రజలకు సేవ చేసిన అనుభవం తనకున్నదని, తనను ఎంపీగా గెలిపిస్తే అన్ని వర్గాలకు అండగా ఉంటానన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ప్రజాప్రతినిధులు, ప్రజలు చెబుతున్నారన్నారు. ఆయన గెలుపునకు పార్టీ శ్రేణులు సైనికుల్లా కృషి చేయాలని, కాంగ్రెస్ బీజేపీల వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి.. వారికి వివరించి మద్దతును కూడగట్టాలని కోరారు. ఈ నెల 13న కేసీఆర్ సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మోహన్గౌడ్, గణేశ్ ముదిరాజ్, సంజీవరెడ్డి, రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, గౌతంగౌడ్, కిరణ్యాదవ్, రాజూనాయక్, లక్ష్మీనారాయణ, భాస్కర్, హరీశ్రావు, పెద్ద భాస్కర్రావు, లక్ష్మారెడ్డి, గంగాధర్, భిక్షపతి, రాజేందర్, వేణు, గణేశ్, కాశీనాథ్, శ్రీను, చంద్రిక తదితరులు పాల్గొన్నారు.