సికింద్రాబాద్, నవంబర్ 11: బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్ల మొగ్గు చూపుతూ వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరేందుకు ఉత్సుకత చూపుతున్నారని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తిగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ సీనియర్ నాయకులు, వివిధ ఆటో యూనియన్ల నేతలు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సమక్షంలో శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికీ అయన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు అఫ్జల్, షబ్బీర్, చంద్రశేఖర్, జహంగీర్, కలీం తదితరుల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మునావర్ వారాసిగుడా అక్బర్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్లో చేరారు. మైనారిటీలకు తగిన ప్రోత్సాహం, అండదండలు అందిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేరొన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ సీనియర్ నేత శీలం సాయి అధ్వర్యంలో వారసిగూడ ఆటో యునియన్ నేతలు కరీం, అహ్మద్ షరీఫ్, సయ్యద్ అసద్, మొయిన్ తదితరులు పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. నార్త్ లాలాగూడలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గీతా దయాకర్ ఆధ్వర్యంలో శాంతి నగర్ ఆటో యునియన్ నాయకులు అబిద్, మొయిన్ భాయి, సమీర్, కలీంలు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ, సికింద్రాబాద్లో తమ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని తెలిపారు. వివిధ పార్టీల నుంచి సైతం బీఆర్ఎస్లోకి చేరేందుకు నేతలు మొగ్గు చూపడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల్లో నిలుస్తూ వారి సాధక బాధకాలు పట్టించుకునే పద్మారావు గౌడ్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.