హైదరాబాద్ : నగరంలోని నాచారంలో గల హెచ్ఎంటీ కాలనీలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎం. ప్రేమ్సింగ్(12) ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు సైకిల్పై బయటకు వెళ్లాడు. కాగా రాత్రి ఎంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. అంతటా వెతికినా తల్లిదండ్రులు భయాందోళనకు గురై బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి రాజు సింగ్ ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలు, రహదారుల వెంట ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.