హాజరైన ఎంపీ సంతోష్కుమార్, మంత్రులు
ఇంద్రకరణ్రెడ్డి, సబితారెడ్డి, సత్యవతి రాథోడ్
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘సేవ్ సాయిల్’ నినాదంతో బైక్పై ప్రపంచ యాత్ర చేపట్టిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ రాష్ట్రంలోని పచ్చదనాన్ని చూసి పరవశించిపోయారు. గురువారం హైదరాబాద్ నుంచి బెంగుళూర్ వెళుతున్న ఈ యాత్రకు శంషాబాద్ సమీపంలోని గొల్లూరులో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్, కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదవ విడతను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ… హైదరాబాద్ నగరమంతా పచ్చగా కనిపిస్తోందని, తెలంగాణ బిగ్ గ్రీన్ స్పాట్గా మారడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం సద్గురు ఆశీస్సులు పొండడం తన పూర్వజన్మ సుకృతమని ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు.
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్తో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ తదితరులు