సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి : ఎన్నికల నిబంధనల పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు చేయడంలో తప్పులేదు.. కానీ నిబంధనల పేరు చెప్పి వివిధ వర్గాలకు చెందిన వ్యాపారులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు.
నగరానికి చెందిన స్వర్ణకారులే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారి పట్ల నిబంధనల వంకతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో వ్యాపారులు ఎంతో ఆందోళన, ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని మంత్రి తలసాని సూచించారు.