బేగంపేట్ నవంబర్ 9: బ్రహ్మాండమైన మెజార్టీతో మూడోసాని విజయం సాధిస్తానని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ముందుగా వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో వివిధ ఆలయాల పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం తన తల్లి తలసాని లలితాబాయి కాళ్లకు మొక్కి ఆ మె ఆశీర్వాదం పొందారు. అనంతరం కుటుంబ సభ్యు లు, బంధువులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నుంచి బన్సీలాల్పేట్లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్దకు చేరుకోని అక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రాం విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అక్కడి నుంచి తలసాని శ్రీనివాస్యాదవ్ వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి మారేడ్పల్లిలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
జబ్బార్ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన నామినేషన్ ర్యాలీ సిటీలైట్ హోటల్, బాటా, ప్యాట్నీ హరిహార కళాభవన్ల మీదుగా నార్త్జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. దారిపొవడవునా కార్యకర్తల నినాదాలు, డప్పు చప్పుళ్లుతో ఎంతో కోలాహలం నెలకొన్నది. ర్యాలీలో రెండు చోట్ల అభిమానులు గజమాలలను భారీ క్రేన్తో మంత్రికి అలంకరించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదన్నర ఏండ్లలో అభివృద్ధి జరిగిందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దేశం లో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచుల పెండ్లికి లక్ష నూట పదహార్లు ఆర్థిక సహాయం, ఆసరా పథకంలో ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. దళిత బంధు, బీసీ బంధు, ఇండ్లు లేని వారికి ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల మంది అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు.
30 వేల ఇండ్లు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మరో లక్ష ఇండ్లు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, హేమలతా, మాజీ కార్పొరేటర్లు అరుణౌగౌడ్, శే షుకుమారి, బీఆర్ఎస్ నాయకులు పవన్కుమార్గౌడ్, అత్తెలి శ్రీనివాస్గౌడ్, శ్రీహరి, వెంకటేశం రాజు, బేగంపేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.