బేగంపేట్ ఏప్రిల్ 22: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట్, బేగంపేట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్ డివిజన్లలోని వివిధ మసీదుల వద్ద ముస్లింలు నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని ఎంజీఎన్ గ్రౌండ్లో వేలాదిమంది ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్కుమార్ పటేల్ పాల్గొన్నారు.
వెంగళరావునగర్ డివిజన్లో కార్పొరేటర్ దేదీప్య విజయ్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు కానుకలు పంపిణీ చేశారు. అఫ్సర్, జహంగీర్, ఉమర్, ఇమ్రాన్, సొహైబ్, సల్మాన్, అజ్జ్, ఆలయ చైర్మన్ చిన్న రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీఆర్ హిల్స్లోని విశాలమైన ప్లే గ్రౌండ్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, నేతలు నజీర్, అప్పుఖాన్, తన్నుఖాన్, జాఫర్, మన్సూర్, సంతోష్, సిరాజ్, షరీఫ్, ఫయాజ్ఖాన్, విజయకుమార్, గని, జబ్బార్, విజయసింహ, రఫి, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.
న్యూబోయిగూడలోని మసీద్-ఏ-ఖూబాలో అధ్యక్షుడు జిలానీ సాహబ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్కుమార్, వెంకటేశన్ రాజు తదితరులు రజాక్, ఫహీమ్, అబ్బాస్, కరీం, జాఫర్, జహంగీర్, జావెద్, రుక్ముద్దీన్, ముకర్రమ్, చాంద్ పాల్గొన్నారు.